పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య

చిలుకూరు: పేదప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన వ్యక్తి పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య అని మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని సీతారామపురంలో జరిగిన సీపీఎం సీనియర్‌ నేత గన్న అప్పయ్య సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. అప్పయ్య సర్పంచిగా సహకారసంఘం అధ్యక్షునిగా సీపీఐ మండల కార్యదర్శిగా పనిచేసిన కాలంలో పేదలకు చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి గురునాధం.వెంకటయ్య, సత్య నారాయణ, ముత్తయ్య రవి, తదితరులు పాల్గొన్నారు.