పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుణుడి బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి మెదక్​ జిల్లా అతలాకుతలమవటంతో పాటు పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. దీంతో మెదక్ మండలంలో ఉన్న కుంటలు చెరువులు, వాగులు, రాయన్​పల్లి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.

రాజ్​పల్లి 16.8, మెదక్ 13.4, హవేలీ ఘన్​పూర్ మండలం నాగపూర్​లో 12.9, వెల్దుర్తి మండలం దామరంచలో 12.5, కొల్చారం మండల కేంద్రంలో 11.5 సెంటిమీటర్​ల వర్షపాతం నమోదయింది. రామాయంపేట్, మనోహరాబాద్ మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కూడవెల్లి వాగు వద్ద ఉన్న లోతట్టు వంతెనపై వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.