పోడురైతులకు వేధింపులు సరికాదు

మహబూబాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హావిూలను విస్మరిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని న్యూడెమక్రసీ నేతలు అన్నారు. ఏళ్ల తరబడి

సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో సర్కారు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమాన్ని వదలేసిన ప్రభుత్వం పదవులు, సంపదపై మక్కువ కనబరుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం సాగే పోరు బాటలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా విశ్రమించుకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ప్రధానంగా పోడురైతులను వేధించే కార్యక్రమాలను అడ్డుకోవాలన్నారు.