ప్రజావాణిలో ఫిర్యాదులను పరిష్కరించండి

కలెక్టర్  ఏ. ఓ. యాదగిరి.                                                                    గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి); ప్రజావాణి ద్వారా వచ్చిన 34 పిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఏ. ఓ. యాదగిరి అన్నారు.సోమవారం వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ద్వారా మొత్తం 34 పిర్యాదులు వచ్చాయని,ధరణి  29 పిర్యాదులు ఇతర 5 సమస్యలకు సంబంధించినవి వచ్చాయని తెలిపారు. సమావేశం లో సూపర్డెంట్ రాజు,మదన్ మోహన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.