ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేద్దాం

డా,,మల్లికార్జున రెడ్డి, పెద్దోళ్ళ గంగారెడ్డి
      నిర్మల్ బ్యూరో, నవంబర్30,జనంసాక్షి,,, భాజాపా రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ను విజయం వంతంచేయలని ఆపార్టీ నేతలు డా,,మల్లికార్జున రెడ్డి, పెద్దోళ్ళ గంగారెడ్డిలు పిలుపునిచ్చారు. బుధవారం  నిర్మల్ జిల్లా కేంద్రంలోనీ భాగుల వాడ పద్మశాలి భవనంలో నిర్మల్  బీజేపీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు
.ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షులు సాధం అరవింద్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులు పెద్దోళ్ళ గంగా రెడ్డి,అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడ్చల్మ రాజు, అప్పాల గణేశ్,అంజుకుమర్ రెడ్డి, డా” మల్లికార్జున్ రెడ్డి,లు మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామికి తెలంగాణ సాధన కోసం డబుల్ ఇంజన్ సర్కార్ తేవడం కోశం మన రాష్ట్ర టైగర్ బండి సంజయ్ కుమార్ ఎంపీ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ను నిర్మల్ పట్టణంలో 30 వేలకు పైగా ప్రజలను భాగ స్వామ్యం చేసీ విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కొమ్ము వినాయక్ రెడ్డి, గాదె విలాస్, ఒడిసెల శ్రీనివాస్, నైయిడి  మురళి,అమర వేణి నర్సాగౌడ్, శ్రవణ్ రెడ్డి, కమల్ నాయన్, భూపతి రెడ్డి, పతార్ల, అలవెలు మంగా, రజినీ వైద్య, అల్లం భాస్కర్, శ్రీరామోజీ నరేష్, నాగేందర్ లతో పాటు పట్టణ బీజేపి నాయకులు పాల్గొన్నారు