ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం సోమగాని రమణయ్య 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు గురువారం దురాజ్ పల్లి లోని ఆలేటి ఆటం ఆశ్రమంలోని వృద్ధులు , అనాథలు , దివ్యాంగులకు పండ్లు, బ్రేడ్, టవల్స్ పంపిణి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని అన్నారు.తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు అందించి దాన గుణాన్ని చాటుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కందికట్ల రమేష్ కుమార్, ఉర్జిత, దొనకొండ వెంకట్, మోర నరేష్ , ఆశ్రమ నిర్వాహకులు వనజ తదితరులు పాల్గొన్నారు.