ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగురవేయాలి

ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగురవేయాలి అని ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు సత్యం ముదిరాజ్ అన్నారు. శనివారం మహాసభ గోడ పత్రిక ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ముదిరాజ్ మహాసభ  రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్   అదేశాలమేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులి మామిడి అధ్వర్యంలో  జిల్లాలోని ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగురవేయాలి అని చెప్పడం జరిగింది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో  సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సత్యం ముదిరాజ్ హుగ్గెల్లి సంఘం అధ్యక్షులు తలారి వేంకటేశం ముదిరాజ్ సభ్యులు మహేష్,అమ్రీష్,యదు ముదిరాజ్,ప్రవీణ్,పవన్ తదితరులు పాల్గొన్నారు.