ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత అధికారులపై ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యతనిచ్చి అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం పథకాన్ని పూర్తి స్థాయిలో జిల్లావ్యాప్తంగా పూర్తి చేయడానికి అధికారులకు సూచనలు చేశారు. నాటిన మొక్కలను రక్షణ కల్పించి తప్పనిసరిగా ప్రతిరోజు మొక్కలకు నీరు పోయాలన్నారు. ఎక్కడైనా మొక్కలు చనిపోయినట్లు కనిపిస్తే వాటిస్థానంలో మళ్లీ నాటాలన్నారు. శాఖల వారిగా అధికారులు నాటిన మొక్కల వివరాలను ఆన్‌లైన్‌ద్వారా నమోదు చేయాలన్నారు. నాటిన మొక్కలకు వందశాతం రక్షణ కల్పించాలన్నారు. ప్రస్తుతం 80 శాతం మొక్కలకు

రక్షణ కల్పించారని మిగతా 20శాతం వాటికి కూడా కల్పించాలన్నారు. మూడో విడత హరితహారంలో జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఊపందుకున్నది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అన్ని వర్గాలు స్వచ్ఛంధంగా పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు.. ఇందులో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం హరితదళాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మొక్క నాటే దగ్గర్నుంచి వాటికి నీళ్లు పోసి సంరక్షించే బాధ్యతను హరితదళాలకు అప్పగించి ప్రోత్సాహకాలను అందించనుంది. జిల్లా యం త్రాంగం వీటి ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ఈ హరితదళాలను ఏర్పాటు చేసే పనికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి 50 మంది విద్యార్థులను సభ్యులుగా ఓ టీచర్‌ను బ్రిగేడర్‌గా నియమిస్తారు. ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరుస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ పండ్లు,పూల మొక్కలుపంపిణీ చేసి నాటించాలన్నారు.