ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి జనగమ రూరల్(జనం సాక్షి)జూన్11: గడపగడపకు మోడి అభివృద్ధి పథకాలు పసరమడ్ల మరియు ఓబుల్ కేశపురం గ్రామలో వంద శాతం కుటుంబాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మోడీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ గడప కి వెళ్లిన ఏ అమ్మ ని పలకరించిన ఏ అన్న నీ పలకరించిన మాకు మోడీ పైసల వచ్చాయి, మాకు ఉచితంగా బియ్యం వచ్చాయి, మాకు మోడి వాక్సిన్ ఇచ్చాడు, మోడీ   మళ్లీ మళ్లీ రావాలి దేశం అభివృద్ధి లో ముందుకెళ్లాలని తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని, గ్రామల ప్రజలు కోరుకోవడం చాలా ఆనందకరం గర్వించదగ్గ విషయం. మోడీ ఎనిమిది సంవత్సరాల సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమం లో  మండల అధ్యక్షులు బండారి తిరపతి యాదవ్ జిల్లా కార్యదర్శి మార్క ఉపేందర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి లద్దునూరి మహేష్ యాదవ్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతపండు రాజు ముక్కెర కరుణాకర్ రెడ్డి మాచర్ల సిద్దులు జెన్నే పల్లి జనర్దన్ రెడ్డి విమల తదితరులు పాల్గొన్నారు