ప్రమాదకర ఇల్లును జెసిబితో కూల్చివేత..

చేర్యాల (జనంసాక్షి) జులై 14 : చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో భారీగా కురిసిన వర్షాలకు ఇల్లు  కూలిపోయే స్థితిలో ఉందని ముందస్తు జాగ్రత్తగా స్థానిక వార్డు కౌన్సిలర్ చెవిటి లింగం, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ లు స్పందించి ఆ ఇల్లును పరిశీలించి ఇంటి యజమానితో కలిసి ఇంట్లో ఉన్న సామాను ఖాళీ చేయించి జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలములో అతి భారీ వర్షాలకు చేర్యాల పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.