ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 10 జిల్లాల నుంచి 4 వేల మంది ప్రతినిధులు తరలి వచ్చారు.  గులాబీ దళపతి సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణతో ప్లీనరీ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల స్వాగత వచనాలు పలకగా, పార్టీ సెక్రటరీ జనరల్ కేకే తీర్మానాలపై మాట్లాడారు.  అనంతరం అమరవీరులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు.