ప్రీప్రొడక్షన్‌ పనుల్లో మహేశ్‌,త్రివిక్రమ్‌ మూవీ

సినీ ఇండస్టీల్రో కొన్ని కాంబోలుంటాయి. అలాంటి కాంబోలలో మహేష్‌`త్రివిక్రమ్‌ ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ’అతడు’, ’ఖలేజా’ క్లాసిక్‌ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్‌గా అంతగా సక్సెస్‌ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి హ్యట్రిక్‌కు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరిలోనే లాంఛనింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. తాజాగా మేకర్స్‌ షూటింగ్‌ అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.
ఇటీవలే త్రివిక్రమ్‌, మహేష్‌కు ఫుల్‌ స్క్రిప్ట్‌ను వినిపించాడట. కాగా తాజాగా మేకర్స్‌ ఈ సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదయ చేయబోతున్నట్లు కూడా గ్లింప్స్‌లో వెల్లడిరచారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసని క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్‌ ఫ్యామిలీతో కలిసి మరో ఫారిన్‌ టూర్‌కు వెళ్ళనున్నాడట.