ప్రైవేట్ బస్సు బోల్తా

mahabuమహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అల్మాస్ పూర్ నుంచి పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. మాచారం సమీపంలో అదుపు తప్పి, బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.