బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం

హావిూలు ఇచ్చి మోసం చేసిన కెసిఆర్‌

ప్రచారంలో విమర్శలు గుప్పించిన డికె అరుణ

గద్వాల,నవంబర్‌22(జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కెసిఆర్‌ వంచించడమే గాకుండా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మావిూఈని కూడా నెరవేర్చలేదన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె గద్వాల మండలం వెంకమ్మపేట, బీరెల్లి, నదీ ఆగ్రహారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ తన మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని, లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఈమె వెంట టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కృష్ణా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి తదితరులున్నారు.

తెరాసతోనే అన్ని వర్గాలు సంక్షేమం

షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని జడ్పీ ఛైర్మన్‌ భాస్కర్‌ అన్నారు. తెరాస అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డికి మద్దతుగా గురువారం గద్వాల మండలం కాకులారం, కొరువపల్లి, పరుమాల గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేలు చొప్పున అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం అందించిందన్నారు. అలాగే పింఛన్లు కూడా రూ.1000కి పెంచామన్నారు. పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎంపీపీ సుభాన్‌, మండల తెరాస అధ్యక్షుడు రమేష్‌ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.