బండారు నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి.

కోడేరు (జనం సాక్షి) నవంబర్ 7 కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన బండారు నరసింహ హైదరాబాదులో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో తేదీ 6/11/2022 ఆదివారం రోజు మధ్యాహ్నం యాకత్పురా రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్పై ప్రమాదవశాత్తుపడి మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాదులో లోని ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీ విభాగంలోఉన్న వారి భౌతిక కాయనికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడం విషాదకరమని అధైర్య పడద్దని పిల్లల చదువు కోసం తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహకారం అందించారు.వారితోపాటు మైలారం గ్రామ మాజీ సర్పంచ్ మరియు జూపల్లి కృష్ణారావు  అనుచరులు తదితరులు ఉన్నారు.