బతుకమ్మ సంబురాలు

ucq8axv8రంగారెడ్డి: ఇవాళ జిల్లాలోని వికారాబాద్ పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్నా. నిన్న మెదక్ జిల్లాలోని కౌడిపల్లిలో బతుకమ్మ సంబురాల్లో కవితతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్న సంగతి తెలిసిందే.