బాధితులకు..టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు.
ఊరుకొండ, సెప్టెంబర్ 25 (జనంసాక్షి):
ఆపదలో ఉన్న వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రేవల్లి సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు అన్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన డి.సునీతకు మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సహకారంతో మంజూరైన రూ.33,000/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను గ్రామ సర్పంచ్ బొబ్బిలి సునీత సాంబశివుడు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్.పెద్ద వెంకటయ్య చేతుల మీదుగా గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క కార్యకర్తకు ఎలాంటి ఆపద వచ్చిన అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆదుకుంటున్న మన ఆపద్బాంధవుడు గౌరవ డా. లక్ష్మారెడ్డి సార్ గారికి ఎల్లపుడూ ఋణపడి వుంటామని తెలియజేశారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తను, నిరుపేదలను టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పల కాపాడుకుంటుంది అని గుర్తు చేశారు. ప్రజలందరూ మన ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డికి మరియు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బచ్చలికూర రమేష్, వార్డు సభ్యులు ఏడ్ల సాయులు, బత్తుల శ్రీకాంత్, రైతు కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్, నాయకులు ఎండీ ఖాజా, ఎండీ.నురద్దిన్, కె.శేఖర్, పి.చందు, పి.కృష్ణయ్య, పర్వతాలు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.