బాల్య మిత్రుని కుటుంబానికి చేయూత….

కేసముద్రం సెప్టెంబర్ 26 జనం సాక్షి / గత 15 సంవత్సరాలుగా మహబూబాబాద్ లోని సామ్రాట్ వైన్ షాపులో నమ్మకంగా పని చేస్తూ ఇటీవల అదే వైన్స్ లో ఉరి వేసుకుని చనిపోయిన శీలం యాకంబ్రం కుటుంబ సభ్యులను సోమవారం రోజున గూడూరు 97-98 ఎస్ ఎస్ సి బ్యాచ్ కాట్రపల్లి గ్రామంనికి వెళ్ళి పరామర్శించినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తము మంచి మిత్రున్ని కోల్పోవడం చాల భాదకరం అని తను ఎక్కడ ఉన్నా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నామని అన్నారు.అలాగే మిత్రులందరు కలసి 60,000/- లు తమ వంతు సాయంగా ఇద్దరి పిల్లలకి పోస్ట్ ఆఫీస్ లో జమచేసి డిపాజిట్ పత్రాలు ఇవ్వడం జరిగింది.ఎల్లవేళలా తన భార్య పిల్లలకి అండగా ఉంటామని ధైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో గూడూరు 1997-98 ఎస్ ఎస్ సి మిత్ర బృందం పాల్గొన్నారు.