బిజెపి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాండూరు మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐబి సెంటర్లో నిన్న మునుగోడు పలివెలలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని నిరసిస్తూ టిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అధికార పార్టీ మునుగోడులో ఓడిపోతామని దాడులకు పాల్పడుతుందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ గూండా రాజకీయాలు చేస్తే సహించేది లేదని తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారని రాబోవు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అందుకు మునుగోడు ఎన్నిక నాంది కాబోతుందని అన్నారు. టిఆర్ఎస్ గుండాల దాడులకు భయపడేది లేదని చర్యకు ప్రతి చర్య ఉంటదని హెచ్చరించారు. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టిఆర్ఎస్ గుండాలు రాళ్ల దాడి చేస్తుంటే పక్కనే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నట్లు ఉండడం అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడమేనని అన్నారు. ప్రగతి భవన్ ఆదేశాల మేరకు దగ్గరుండి దాడి చేయించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై దాడి చేసిన టిఆర్ఎస్ గుండా లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ గూండా రాజకీయాలకు తెలంగాణ ప్రజానీకం చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పట్టేం విష్ణు కళ్యాణ్,భాస్కర్ గౌడ్ సీనియర్ నాయకులు చిలువేరుశేషగిరి తుకారం,సిద్ధం మల్లేష్ విగ్నేష్ శ్రవణ్,సందీప్ తదితరులు పాల్గోన్నారు