*బిజెపి గెలుపును కర్రలతో రాళ్లతో అడ్డుకోలేరు*

*రాళ్లతో దాడి చేయడం సిగ్గుచేటు*
 *పెద్దేముల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు సందీప్ కుమార్*
పెద్దేముల్ నవంబర్ 02 (జనం సాక్షి)
బిజెపి గెలుపును కర్రలతో రాళ్లతో అడ్డుకోలేరని పెద్దేముల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు సందీప్ కుమార్ పేర్కొన్నారు.తెరాస ప్రభుత్వం బిజెపి ఎమ్మెల్యే రాజేందర్ పై రాళ్లతో కర్రలతో దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పిలుపుమేరకు బుధవారం ఆయా మండల కేంద్రాలలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ…. తెరాస పార్టీ రాష్ట్రంలో గుండా రాజకీయాలు చేస్తున్నారని నిరసనలు తెలిపేందుకు కూడా బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని పలవేళ గ్రామంలో ఈటెల రాజేందర్, బిజేపి కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సమయంలో తెరాస పార్టీ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తమ అనుచరులతో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కార్యకర్తలపై దాడి చేయడం వాహనాలు ధ్వంసం చేయడం రాళ్లతో కర్రలతో కొట్టడం ప్రజాస్వామికమని తెలిపారు. మునుగోడు లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు సునాయాసమవుతున్న సమయంలో తెరాస పార్టీ జీర్ణించుకోలేక ఇలాంటి దాదులకు పాల్పడుతున్నారని అన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ప్రజల మద్దతు పూర్తిగా బిజెపి పార్టీకి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా బీజేవైఎం కార్యదర్శి రమేష్ సాగర్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు భూమే నరసింహ,మండల ప్రధాన కార్యదర్శి హరీష్ గౌడ్,  రాము,సోషల్ మీడియా కో కన్వీనర్ యాదయ్య గౌడ్, ప్రదీప్,శేఖర్, పరిపూర్ణ చారి తదితరులు పాల్గొన్నారు.