బ్యాంకు వద్ద మోసగాళ్లు

ఆత్మహత్య చేసుకున్న మోసపోయిన రైతు
మహబూబ్‌నగర్‌,మే28(జ‌నం సాక్షి):  జడ్చర్ల మండలంలోని గంగాపూర్‌ గ్రామంలో మల్లయ్య అనే రైతు ఇంటిముందు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. రైతుబంధు పథకం ద్వారా ఇటీవల మల్లయ్యకు రూ.33వేల పంట రుణసాయం చెక్కు అందింది. ఈ నెల 26న ఆ చెక్కును జడ్చర్లలోని బ్యాంకులో మార్పిడి చేసి నగదు తీసుకున్నాడు. బయటకు వచ్చి నిల్చున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మల్లయ్యకు మాయమాటలు చెప్పి డబ్బులను కాజేశాడు. దీంతో ఆవేదనకు గురైన అతడు సోమవారం తెల్లవారుజామున ఇంటిముందు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.