బ్యాంక్ సేవాలను వినియోగించుకోవాలి.

టీజీబీ బ్యాంక్ అందిస్తున్న సేవలను వినియోగదారులు వినియోగించుకోవాలని గాదిగూడ టీజీబీ బ్యాంక్  మేనేజర్ జి. మౌనిత్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ  పాఠశాలలో ఆర్థిక అక్షర సత్య సదస్సును కల బృందం చేత అవగాహన కల్పించారు. బ్యాంకు కల్పిస్తున్న జీవిత బీమా, పి ఎం జె జె వై, సి ఎం ఎస్ సి వై, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి వివిధ సేవలను వివరించారు గ్రామాల్లో అందిస్తున్న డిజిటల్ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. డ్వక్రా క్రాప్ లోన్లు సక్రమంగా వినియోగించుకోవాలని సమైనికి తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలల్లో టీచర్లతో కలిసి చిన్నారులకు కాపీ, పెన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది  లక్ష్మణ్, లింబరావు, పాఠశాల సిబ్బంది కళ్ళజత బృందం పాల్గొన్నారు.