బ్రిటీష్‌ , జపాన్‌ శాస్త్రవేత్తలకు వైద్య రంగంలో

నోబెల్‌ బహుమతుల ప్రదానం

స్టాక్‌హోమ్‌: బ్రిటిష్‌ శాస్త్రవేత్త జాన్‌ గర్ఘాన్‌, జపనీస్‌ శాష్త్రవేత్త షిమ్యా యమానాకాలకు మూలకణాలపై పరిశోధనలపై వైద్య రంగంలో నోబెల్‌ బహుమానం సోమవారం ప్రకటించారు. శరీర భాగాలు వ్యాధిగ్రస్తులైనపుడు వాటి స్థానంలో కొత్త కణజాలం అమర్చవచ్చన్న ఆశలు ఈ పరిశోధనతో మెరుగయ్యాయి. ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతులను గెలుచుకు న్నారు. బ్రిటన్‌కు చెందిన జాన్‌ గుర్ఘాన్‌ ప్రస్థుతం కేంబ్రిడ్జ్‌లోని గుర్డాన్‌
బ్రిటీష్‌ , జపాన్‌ శాస్త్రవేత్తలకు ..
ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నారు. ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అయిన యమనక క్యోటో యూనివర్శిటీలో ప్రొఫెసరుగా పని చేస్తున్నారు. వీరిద్దరు పరిశోధనలు కణాల పెరుగుదలను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయని, పెద్దవారి కణాలను పిల్లలలో ఉండే కణాలుగా మార్చ వచ్చని శాస్త్ర వేత్తలు నిరుపించారని, కణాలు, జీవులు ఎలా అభివృద్ది అవుతాయో తెలుసుకునే విధానాన్ని ఈ పరిశోధనలు విప్తవాత్మకంగా మార్చి వేసినట్లు నోబెల్‌ ప్రైజ్‌ కమిటీ పేర్కొంది.