భద్రకాళీ జాతర ప్రారంభం

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి దేవాలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, కల్యాణమహోత్సవం, ఉదయం 11 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శివాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి చెన్నయ్య, సభ్యులు, రామారావులు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు.