భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి ఆధ్వర్యంలో  మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపం లో గల  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు.  చీకటిలో మగ్గుతున్న అన గారిన  జీవితాలలో వెలుగులు నింపిన వ్యక్తి అంబేద్కర్ అని , వారి ఆశయాలను అందిపుచ్చుకోవడంలో యువత ముందుండాలని అన్నారు. ఆయన తీసుకువచ్చిన రిజర్వేషన్ల వలన అనగారిన కులాలు తాను పడ్డ ఇబ్బందులు ఎవరూ పడకూడదని ఉద్దేశంతో తీసుకువచ్చార అన్నారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MS కళాశాల ప్రిన్సిపాల్ రంగారావు ,రేవంతన్న సైన్యం నాయకులు , జలంధర్, భారీ వెంకన్న , వీరబాబు, చంటి ,తదితరులు పాల్గొన్నారు.