భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడుని నియమించాలి* – వేమూరి సత్యనారాయణ

మునగాల, జూన్ 11(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ మండల కేంద్రంలో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి, బహుభాషా కోవిదులు, వివాదరహితులు, రాజనీతిజ్ఞుడు, మచ్చలేని నాయకులు, తెలుగు వారి సంస్క్రుతి సాంప్రదాయాలను అనునిత్యం ఇనుమడింపచేసే మహొన్నత వ్యక్తి, తెలుగు వారి ఔన్నత్యాన్ని దశదిశలా వ్యాపింపజేయగల అపర చాణిక్యుడు, గ్రామస్థాయి రాజకీయాలనుంచి  అంచెలంచెలుగా ఎదిగి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన గొప్ప నేత, నేటి  రాజకీయ నాయకులకు ఒక దిక్సూచి, మంచి వాగ్ధాటితో  చలోక్తులు విసురుతూ నాయకులకు దిశా నిర్దేశం చేసిన ముప్పవరపు  వెంకయ్యనాయుడుని భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడుని  నియమించాలని మునగాల మండల సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ కోణంలో చూడకుండా ఏకగ్రీవంగా ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అందుకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు చొరవ తీసుకుని మన తెలుగు వారైన వెంకయ్యనాయుడుకి సహకరించాలని కోరారు.  ఇప్పటి వరకు ఎన్నికైన 15 మంది రాష్ట్రపతి అభ్యర్థుల్లో మన వారికి అవకాశం దక్కలేదు. ఇప్పుడు జరుగుతున్న 16వ రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వారికి అవకాశం కల్పించాలని, ఇందుకు ముఖ్యంగా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని, ఇందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.