*భారీ వర్షాలకు ఇండ్లు, పంటలు నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి.

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య డిమాండ్.
15( జనం సాక్షి) రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవడంతో ఇండ్లు, పత్తి పంటలు దెబ్బతిన్న బాధితులను  రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య డిమాండ్చేశారు.
          శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా అనేక ఇండ్లు కూలిన బాధితుల వివరాలు, రైతులు వేసిన పత్తి పంట దెబ్బతిని నష్టపోయిన రైతుల వివరాలను సంబంధించిన అధికారులతో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ని కోరారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో అనేక గ్రామాల్లో ఇండ్లు కూలిన ఘటనలో ఇంటి లోపల ఉన్న వస్తువులు దెబ్బతిని నిరాశ్రులయరని ఆ బాధితులకు తక్షణంగా  20 వేల రూపాయలతో పాటు, నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆర్థికంగా బలపేతం  చేయాలని కోరారు.
Attachments area