భువనగిరిలో బాంబు కలకలం

నల్గొండ :భువనగిరిలో బాంబు కలకలం చోటు చేసుకుంది. భద్రాద్రి థియేటర్‌లోకి బ్యాగ్‌తో నలుగురు యువకులు వచ్చారు. సీట్ల మధ్యలో బ్యాగ్‌ను పెట్టి వెళ్లిపోతుండగా పక్కన కూర్చున్న వాళ్లు యువకులను పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని వెంబడించారు. నిందితుల్లో ఓ యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. థియేటర్‌ వద్దకు చేరుకున్న పోలీసులు బాంబ్‌స్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బాంబు ఉందని కలకలం రేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.