మండల ఆరోగ్య కేంద్రం తనిఖీ

చిలుకూరు: మండల ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆమోష్‌ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వైద్య సేవలందించాలని
ఆదేశించారు. వైద్యాధికారి, యూడీసీ విధులకు సక్రమంగా హాజరు కావటం లేదని, వారికి మెమోలు జారీ చేస్తామన్నారు. ఆయన వెంట మండల వైద్యాధికారి ప్రవీణ్‌, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.