మండుతున్న ఎండలు…వడదెబ్బతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 దాటితేనే బయటకురావడానికి జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. ప్రజలు కూడా బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం కోర్టు పనులవిూద ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్‌కి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. రోజంతా ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై శుక్రవారం రాత్రి నిద్రించిన చోటే మరణించాడు. శనివారం ఉదయం శ్రీనివాస్‌ నిద్రలేవకపోవడం గమనించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు.