మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆఫ్జల్ ఖాన్ :

ఆదివారం కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి  చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. వీరిరువురి పై ఐటి సోదాల నేపథ్యంలో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి లకు మద్దతు గా కలిసి నట్లు తెలిపారు. సోదాలు చేసే క్రమంలో మోత్తం కుటుంబానికి ఇబ్బంది కలిగించటం సరి కాదని  అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు తాడెం కుమార్, మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
27ఎస్పీటీ -1: మంత్రి ని కలిసిన నాయకులు