మంథనిలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

– నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి

– యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమిని గౌడ్ డిమాండ్

జనంసాక్షి, మంథని : విద్యార్థులు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి నెలకు రూపాయలు 3016 వెంటనే ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెమినీ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మంథని నియోజక వర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, జిల్లా జనరల్ సెక్రెటరీ ఆర్ల నాగరాజు, అసెంబ్లీ కార్యదర్శి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు పోరెల్ల రంజిత్, గొల్లపల్లి శ్రీనివాస్, టింకు, గుండేటి రాజశేఖర్, అక్కపాక శ్రావణ్, పోగుల సాగర్, బూడిద రంజిత్, మద్దెల రవి, బడికల మనోజ్, నారమళ్ళ రాకేష్, ఎరుకల సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగుల రాజయ్య, దోర గోర్ల శ్రీనివాస్, లైసెట్టి రాజు, ఎజాజ్, జనగామ సడవలి, సోషల్ మీడియా పెద్దపల్లి,మంథని ఇన్చార్జిలు కిరణ్ గౌడ్, పెండ్యాల రాజు,రామగిరి ఇంచర్జ్ శ్రీధర్ వీణ,యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.