మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత

ప్రణయ్‌ పుట్టాడని సంబరం

నల్గొండ,జనవరి30(జ‌నంసాక్షి): మిర్యాలగూడకుచెందిన అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం నాలుగుంబావుకు మగశిశువుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి వరగ్‌ఆలు తెలిపాయి. పెళ్లిరోజే బాబు పుట్టడంతో ప్రణయే మళ్లీ పుట్టాడని అమృత మురిసిపోతోంది. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృత అదే పట్టణానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వారి ప్రేమవివాహం ఇష్టంలేని మారుతీరావు గతేడాది సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. అప్పటికి అమృత నాలుగు నెలల గర్భిణి. ప్రణయ్‌ హత్య తరువాత చాలా మంది ఆమెను అబార్షన్‌ చేయించుకోమన్నారు. కానీ బిడ్డకు జన్మనిచ్చి ప్రణయ్‌ ప్రతిరూపంగా చూసుకుంటూ బతుకుతానని అమృత అప్పుడే చెప్పారు. అప్పటినుంచి ఆమె అత్తింటివారి సంరక్షణలోనే ఉంది. నెలలు నిండడంతో మంగళవారం అమృతను నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.