మహబూబ్‌నగర్‌లో యువకుడి మృతదేహం లభ్యం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 11 : జిల్లాలోని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ దగ్గర వేణుగోపాలస్వామి గుండంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సమీపంలో ఓ బైక్‌ను పోలీసులు గుర్తించారు. బైక్ నెంబర్ ‌- టీఎస్ 08 2093.