మహబూబ్‌నగర్: డ్రైనేజీలో మునిసిపల్ కార్మికుడి మృతదేహం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 16: జిల్లాలోని వనపర్తిలో ఓ మునిసిపల్‌ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం డ్రైనేజీ కాలువలో లభ్యమైంది. దీంతో కార్మికుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా అతడిని హత్యచేసి కాలువలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.