మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి కార్యక్రమం యేకుల సురేష్

: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చింతకుంట్ల గ్రామంలో సోమవారం నాడు  మహాత్మా  జ్యోతి రావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా చింతకుంట్ల పరిధిలోని డి.ఎం కుంట లో గల మహాత్మ జ్యోతిరావు  పూలే విగ్రహానికి ఉప సర్పంచ్ యేకుల సురేష్ ,మరియు గ్రామ ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉపసర్పంచ్ యేకుల సురేష్  మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు ఎంతగానో కృషి చేశారన్నారు, సమాజంలో అన్ని కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే సమాజానికి  చేసినటువంటి సేవలలొ భారతదేశ మొదటి సంఘసంస్కర్తగా మహాత్మ జ్యోతిరావు పూలే  నిలిచారు అన్నారు. ఈ కార్యక్రమంలో చేపూరి చంద్రకళ, సుకన్య, యేకుల రాజేందర్, జంగాల ప్రవీణ్, యేకుల  త్రివేన్, యేకుల కాంతయ్య, యేకుల అనంత రాములు తదితరులు పాల్గొన్నారు.