మహిళను దారుణంగా చంపారు…

మహబూబ్‌నగర్: ఓ మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేశారు. వివరాలు….మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టువాగు సమీపంలోని పొలాల్లో బురదమన్నులో ఓ మహిళ మృతదేహం కూరుకుపోయి ఉండగా శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని బురదమన్నులో పూడ్చేసినట్లు భావిస్తున్నారు. మృతురాలు చిన్నచింతకుంటకు చెందిన యాదగిరి పోశమ్మ (55)గా గుర్తించారు.