మాజీ ముఖ్యమంత్రి మనవడు పురూరవ రెడ్డి జన్మదిన వేడుకలు.
సికింద్రాబాద్ ( జనం సాక్షి ) : మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్న రెడ్డి మనుమడు మర్రి పురూరవ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర టిపిసిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ దాడిగా సందీప్ రాజు, సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనంత కృష్ణ రావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . అడ్డగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ శివ శంకర్ సమక్షంలో కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి మర్రి పురూరవ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలపరు. అనంతరం మర్రి పురూరవ రెడ్డి చేతుల మీదుగా పేషెంట్లకు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ బన్ ఇచ్చారు . ఈ జన్మ దిన వేడుకలలో డివిజన్ అధ్యక్షులు గంట రాజు సాగర్ సికింద్రాబాద్ ఏ బ్లాక్ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ ఏ బ్లాక్ ఉపాధ్యక్షులు కొమరమ్మ డివిజన్ ఉపాధ్యక్షులు సుదర్శన్, యూసుఫ్, లీగల్ నవీన్,ఎంఆర్ శ్రీనివాస్, సిటీ సెక్రటరీ లక్ష్మీ యాదవ్, ఏ బ్లాక్ సెక్రెటరీ మంద ప్రభాకర్, యువ నాయకులు సాయి చందర్, సోయల్, ఈశ్వర్ మరి కొంతమంది నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
