మాజీ సర్పంచ్ జంగయ్యగౌడ్ సేవలు కొనియాడదగినవి

ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
మాజీ సర్పంచ్ జంగయ్య గౌడ్ మృతి..నివాళి అర్పించిన ఎమ్మెల్యే
రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం (జనంసాక్షి): యాచారం మండలంలోని  తమ్మలోని గూడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఉడతల జంగయ్య గౌడ్ మృతిచెందారు. దీంతో విషయం తెలుసుకున్న  రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి శనివారం మృతుడు జంగయ్య గౌడ్ ను పరామర్శించి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యపర్చారు.  సర్పంచ్ గా  గ్రామ అభివృద్ధితోపాటు  పార్టీ ఉన్నతికై నాయకులతో, కార్యకర్తలతో మమేకమై తాను చేసిన క్రియాశీల సేవలను ఎమ్మెల్యే  కొనియాడారు.  మృతుడిని పరామర్శించిన వారిలో మండల అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, పిఎసిఎస్  చైర్మన్ రాజేందర్ రెడ్డి, వైస్ చైర్మన్, కారింగు యాదయ్య, నాయకులు ఓరుగంటి యాదయ్య తదితరులు ఉన్నారు.