మియాజాని సేవలు మరువలేనివి


-సిపిఐ రాష్ట్ర (ఏపీ )కార్యవర్గ సభ్యులు ఎండీ మునీర్
అశ్వారావుపేట, ఫిబ్రవరి 11(జనంసాక్షి )సిపిఐ పార్టీ లో ఉండి ప్రజలకోసం పోరాటాలతో సమస్యలను పరిష్కరించిన మియాజని సేవలు మరువలేనివని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి మునీర్ అని ప్రశంసించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
కామ్రేడ్ మియా జానీ 13వ వర్ధంతి లో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎండి మునీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ డి సలీం మాట్లాడుతూ మియా జానీ అశ్వారావుపేట అప్పటి నియోజకవర్గంలో వేలేరుపాడులో నుండి ఇటు చండ్రుగొండ వరకు ఆయన ఎన్నో ఉద్యమాలు నిర్వహించాలని ఎంతోమంది పేద వాళ్లకి సాగు భూమిని ఇళ్ళ స్థలాలు పంచారని వారి అడుగుజాడల్లో మనందరం నడవాలని వారి ఆశయ సాధనకై మిలిటెంట్ పోరాటాలు చేయాలని మియా జానీ గారి లేని.లోటును మనందరం భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూ సీనియోజకవర్గ నాయకులు తిరనతి సత్యనారాయణ సిపిఐ మండల కార్యదర్శి గనిన రామకృష్ణ టావున్ పార్టీ కార్యదర్శి రఫీ మున్నా శోభన్,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు