మిర్యాలగూడలో దోపిడీ దొంగల బీభత్సం

నల్గొండ : మిర్యాలగూడ హనుమాన్‌పేటలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. నిన్న రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను కట్టేసి 40 తులాల బంగారం, అర కేజీ వెండి, రూ. 50 వేల నగదు దోచుకెళ్లారు స్థానికులు విషయం తెలుసుకొని దంపతులను విడిపించి పోలీసులకు సమాచారమందించారు.