మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల రాద్ధాంతం – హరీష్ రావు..

నిజామాబాద్ : కామారెడ్డి మండలం బి.బి.పేటలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, చంద్రబాబు మహబూబ్ నగర్ లో ఒక మాట..గుంటూరులో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ తనవల్లే వచ్చిందని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.