ముంపు ప్రాంతాలను సందర్శించిన సిపిఐ నాయకులు

జూలై .జనంసాక్షి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక వరద ముంపు ప్రాంతాలను సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం, పాల్వంచ మండల కార్యదర్శి పూర్ణ స్థానిక మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు ముంపు ప్రాంతాలను సందర్శించి వరద బాధితులకు సాయ సహకారాలు అందించారు. పునరావస కేంద్రాలను సందర్శించి వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం బాధితులకు తక్షణమే వరద సహాయ నిధిని ప్రకటించాలని, ముంపుకు గురైన ఇల్లు కూలిపోతే వెంటనే వారికి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.