ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- యాచారం మండల పరిధిలోని మల్కిస్ గూడా గ్రామానికి చెందిన నాగిళ్ల దమయంతి  డవలయ 24000 వేలు  వరికుప్పల దినేష్  జనార్ధన్ 20000 వేలు  మంగ పోలీస్ 30000 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో మంజూరు కాగా సోమవారం నాడు వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొలం అనంత రెడ్డి ఎంపీటీసీ డేరంగుల శారద శంకర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలకు ఆపద సమయంలో ఆసరాగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తోందని ఎందరో పేద ప్రజలను సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని అర్హులైన పేద ప్రజలందరూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అనసూయ అబ్బయ్య కృష్ణారెడ్డి గౌరారం మాజీ డవళి శ్రీశైలం సర్పంచ్ మల్లేష్ రవళి దమయంతి తదితరులు పాల్గొన్నారు.