ముదిరాజ్ లు ఐక్యం కావాల

తాలుకా ముదిరాజ్ అధ్యక్షులు రామస్వామి
ముఖ్య సలహాదారులు హన్మంత్ ముదిరాజ్
దోమ నవంబర్ 21(జనం సాక్షి)

దోమ మండల పరిధిలోని కిష్టపూర్ గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం దినోత్సవ సందర్బంగా జెండా ఎగురవేయడం జరిగింది. ముదిరాజ్ లు అందరూ ఐక్యంగా ఉండి అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాలుకా ముదిరాజ్ అధ్యక్షులు రామస్వామి ముదిరాజ్, ముఖ్య సలహాదారులు హన్మంత్ ముదిరాజ్ , మండల అధ్యక్షులు నర్సింలు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి చందు ముదిరాజ్, కార్యదర్శి సంజీవ్ కుమార్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు కేశవులు కిష్టపూర్ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, శ్రీను, రవి, జంగయ్య, నర్సింలు, శేఖర్, శ్రీనివాస్, శేఖర్, నర్సింలు, రాములు, శ్రీనివాస్, గ్రామ ముదిరాజ్ పెద్దలు పాల్గొన్నారు