మున్సిపల్ లో అభివృద్ది పనులు వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

రిగిరూరల్, నవంబర్ 28 ( జనం సాక్షి ) :
పరిగి మున్సిపల్ లో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతగా చేస్తూ వేగంగా చేపట్టాలని  వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పరిగి మున్సిపల్ లో జరుగుతున్న అభివృద్ది పనులను సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్బంగా పరిగిలోని  లో   నర్సరీలను, ట్రీ పార్కులను, క్రీడా ప్రాంగణాలను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను, వైకుంఠ రథం, వైకుంఠధామం పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టి త్వరత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్బంగా పరిగి మున్సిపాలిటీకి మొదటి సారి రావడంతో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, కౌన్సిలర్ ఎదిరె కృష్ణ, మునీర్, నాగేశ్వర్ శాలువా పూలమాలలతో సత్కరించారు.ఈ పరిశీలనలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మల్లేష్, పురపాలక  మేనేజర్ నరేష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ సంపత్ కుమార్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
28 పిఆర్ జి 03లో పరిగిలోని పార్కును పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, పక్కన మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, కమిషనర్ శ్రీనివాసన్