ముస్లిం సమ్మేళనానికి ప్రభుత్వ సాయం

, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండ లం బాలాపూర్‌లో నవంబర్‌లో జరిగే ముస్లిం సమ్మేళనానికి విద్యుత్‌, మంచినీటి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రా వు అధికారులను ఆదేశించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షాహీన్‌నగర్‌ సమాజ్‌కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారతస్థాయి ముస్లిం సమ్మేళనం నవంబర్‌ 21 నుంచి మూడురోజుల పాటు జరుగనుంది. ఈ ముస్లిం మహాసభకు సదుపాయాలు కల్పించాలని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, కమిటీ సభ్యుడు ఎస్‌ఏహెచ్‌ అంజూమ్‌ ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన సీఎం సభకు నిరంతర విద్యుత్‌, మంచినీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.