మోడీ నిర్మించనక్కర్లేదు

ఆలయాలు మేమే పునర్నిర్మించుకుంటాం
ఉత్తరాఖండ్‌ సీఎం బహుగుణ
డెహ్రాడూన్‌, జూన్‌ 30 (జనంసాక్షి)
వరుణుడి ప్రకోపం, జల విళయా నికి దెబ్బతిన్న ఆలయాల పునర్ని ర్మాణానికి ఎవరి సాయం అక్కర్లే దని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ స్పష్టం చేశారు. ఆలయాలు మోడీ పునర్నిర్మించక్కర్లే దని ఆయన పేర్కొన్నారు. కేదార్‌నా థ్‌ ఆలయ పునర్నిర్మాణం చేపడతా మన్నా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సహా మరికొందరి ప్రతిపాదనలను ఆయన తిరస్కరిం చారు. ఆలయ పునర్నిర్మాణ బా ధ్యత తమ రాష్ట్ర
ప్రభుత్వం, దేవాలయ కమిటీ చేపడతాయన్నారు. 8వ శతాబ్దం నాటి ఆలయ పునర్నిర్మాణానిక అవసరమైన నిధులను మాత్రం ఎవరైనా విరాళంగా ఇవ్వవచ్చని సూచించారు. ఈ విషయంలో మా త్రం తమ ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తుందని, ఇతర రాష్ట్రాల, పార్టీల నేతలతో తాను వివాదానికి దిగబోనని, సాయం ఎవరిచ్చినా తీసుకుంటామని అన్నారు.