మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగెటివ్‌ వచ్చనట్లు తెలిపారు. ప్రజలు సామాజికదూరం పాటిస్తూ, మాస్కులు తప్పకుండా ధరించాలని, తరచుగా శానిటైజర్‌ వాడాలని పలు సూచనలు చేశారు. ఇదిలావుంటే
భీంగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని మండల వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె తెలిపారు.