యాచారం మండలంలో మైనింగ్ జోన్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

యాచారం మండలం లో ఎలాంటి మైనింగ్ కు అనుమతులు ఇవ్వొద్దని బిజెపి యాచారం మండల పార్టీ నుండి ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కి ఎంపీపీ  సమక్షంలో  వినతిపత్రం అందచేసిన బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతకు ముందే చెప్పిన ఇప్పుడు కూడా చెబుతున్న ఎలాంటి పరిస్థితులలో మైనింగ్ రానివ్వను ఓకే వేల ఎవరైనా ప్రయత్నం చేస్తే నేనే స్వయానా వచ్చి మీకు మద్దుతుగా ఉంటాను అని చెప్పడం జరిగింది, ఇట్టి కార్యక్రమం లో మల్కిజ్ గూడా ఉపసర్పంచ్ పల్లపు నరేష్, ఉపాధ్యక్షులు పత్తి రాజు, నారిమళ్ళ రమేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి  సంగేమ్ శ్రీనాథ్, బన్నే శివ మోడీ, సపావత్ గణేష్ నాయక్, పల్లపు విజయ్, తదితరులు ఉన్నారు